EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 20 క్వింటల్లా ప్రభుత్వ రాయితీ బియ్యం స్వాధీనం - ఉట్నూర్ ఎ ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్

    Author REPUBLIC HINDUSTHAN | 20 Mar 2025, 09:43 AM |


    *దాదాపు రూ 40 వేల విలువగల ప్రభుత్వ రాయితీ బియ్యం, తరలిస్తున్న వాహనం స్వాధీనం.*

    *4 గురి పై కేసు నమోదు.*

    *అక్రమ సరుకు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.*




    ఉట్నూర్: బుధవారం రాత్రి ఉట్నూర్ మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 20 క్వింటల్లా ప్రభుత్వ రాయితీ బియ్యం లభ్యమైందని ఉట్నూరు ఎ ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. అక్రమంగా సరుకు రవాణా చేసే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అక్రమ రవాణా చేస్తున్న దళారుల పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడిందని తెలిపారు. కేసు నమోదు అయిన వారి వివరాలు
    1) నల్లన్న కిష్టయ్య s/o బుచ్చన్న, ఉట్నూర్, రేషన్ షాప్ డీలర్.
    2) ఠాకూర్ అరుణ్ సింగ్ s/o ధారా సింగ్, ఉట్నూర్, వాహన డ్రైవర్.
    3) ఠాకూర్ ధారా సింగ్ s/o శంభు సింగ్, ఉట్నూర్,
    4) గ్యాన్ సింగ్
    ప్రభుత్వ రాయితీ బియ్యం తక్కువ ధరకే కొని ఎక్కువ ధరలకు అమ్ముతున్న దళారి.
    ఈ ముగ్గురిపై కేసు నమోదు అయిందని తరలిస్తున్న వాహనం (AP 01 T 4257) స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అక్రమ వ్యాపారం ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద నుండి కొనుగోలు చేస్తూ ఎక్కువ ధరలకు అమ్ముతున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఏ ఎస్ పి హెచ్చరించారు.

    ఇవి కూడా చదవండి