సాధారణంగా ఇచ్చోడా సర్వసభ్య సమావేశం.....
సమస్యలు పరిష్కరించాలని కోరిన సర్పంచ్ లు.... అప్పులు చేసి పనులు పూర్తి చేస్తున్నాం..... ఓ సర్పంచ్ ఆవేదన ... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా : ఇచ్చోడా మండల సర్వసభ్య సమావేశం సాధారణంగా ముగిసింది. ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో రోడ్లు , డ్రైనేజి ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు.... మండలము లోని మారుమూల ఆదివాసీ గ్రామాలైన శివ్ పెట్ , బాబ్జి పెట్ గ్రామాలకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలని కోరారు. ఇచ్చోడా మండల...