సౌదీలో ఘనంగా తెలుగు మాట..<br><br>తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సౌదీ తెలుగు సమాజం
Hyderabad/Jeddah : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ప్రవాసుల పట్ల భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని రియాద్లోని భారత రాయబార కార్యాలయ ప్రథమ కార్యదర్శి మహమ్మద్ షరీక్ బదర్ అన్నారు. రాజ్యంలో భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలను ప్రారంభించిందని, విదేశాల్లోని ప్రవాస భారతీయులలో సుసంపన్నమైన భారతీయ సంస్కృతిని కాపాడేందుకు తన పూర్తి సహాయసహకారాలను అందజేస్తోందని ఆయన అన్నారు. సౌది అరేబియా లో SATA ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాష దినోత్సవం కార్యక్రమం దృశ్యాలు తెలుగు దినోత్సవాన్ని ఉద్దేశించి షరీక్ బదర్ రాజ్యంలో శక్తివంతమైన తెలుగు సమాజాన్ని కొనియాడారు. సౌదీ అరేబియాలోని తెలుగు ఎన్నారైల సామాజిక మరియు సాంస్కృతిక సంస్థ SATA (సౌదీ అరేబియా...