ఎత్తైన గణపతి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని అతి ఎత్తైన గణపతులలో ఒకటైన ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని కుమార్ జనతా గణేష్ మండలి వద్ద ఉన్న 52 అడుగుల ఎత్తైన గణపతి వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం . ఈ సందర్భంగా ఇరువురు అధికారులకు ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరగా ఇరువురు అధికారులకు శాలువాతో సత్కరించి సన్మానించారు.