కవిత బెయిల్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ...
న్యూ ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రేపు మంగళ వారం విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయ స్థానం తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 20న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల ధర్మాసనం విచారించనుంది..