ADB: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ కార్యక్రమంలో జర్నలిస్టులకు అవమానం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ కార్యక్రమాన్ని జర్నలిస్టులు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో జర్నలిస్టులు తమ నిరసన వ్యక్తం చేశారూ. జర్నలిస్టులకు కుర్చీలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులు. నిరసన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైనా పార్టీ నాయకులను కూచోబెట్టి జర్నలిస్టులకు వసతులు ఏర్పాటు చేయని అధికారుల తిరును జర్నలిస్టులు తప్పుబట్టారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ కోసం తమ వంతు కృషి చెసిన జర్నలిస్ట్ లను చిన్నచూపు చూడడం సరికాదని పలువురు పేర్కొన్నారు.