🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 30 Apr, 2022 | Page: 1

అబ్కారి శాఖలో పట్టుబడిన వాహనాల వేలం పాట


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఎక్సైజ్ శాఖ లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను మే 7 వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఇచ్చోడా ఎక్సైజ్ సి ఐ  రాజమౌళి ఒక ప్రకటన లో తెలిపారు.
ఇచ్చోడ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే ఈ వేలం పాట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదిలాబాద్  వై హిమశ్రీ అద్వర్యంలో వేలం పాటనం నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ వేలం పాటలో మొత్తం ఎనిమిది (8) వాహనాలు మరియు వాటి ధరలను ప్రకటించారు. 




ఎక్సెల్ మొపేడ్ అప్సీట్ ప్రెస్ ధర రూ. 30,000 వేలు,టీవీఎస్ ఎక్సల్ మొపేడ్ అప్సెట్ ప్రైస్ రూ.2,000 వేలు, హీరో హోండా స్పీలెండర్ ధర రూ.5,000 వేలు,  హీరో హోండా యాక్టీవ అపీసెట్ ప్రెస్ రూ.20000 వేలు,  టి విఎస్ ఎక్సల్ మొపేడ్ 2,000 వేలు,హీరో హోండా స్పీలెండర్ రూ.15,000 వేలు, ప్యాషన్ ప్రో బైక్ రూ. 20000 వేలు,హీరో మయిస్త్రో  ధర రూ.15000 వేల



చొప్పున ధరలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు ఉదయం 10:30 గంటల నుండి 12:30 మధ్యాహ్నం వరకు ముందుగా 50% ధరావత్తు సొమ్ము చెల్లించాలని తెలిపారు. ఈ సమయంలో వాహనాలను  ఎక్సైజ్ స్టేషను ఆవరణలో తనిఖీ చేసుకోవాలని తెలిపారు.

🏠 Home