రాజస్థాన్కు చెందిన మహమ్మద్ షరీఫ్ స్వదేశానికి... తదుపరి చికిత్స కోసం ప్రయాణం
ఇంటర్నేషనల్ డెస్క్ : రాజస్థాన్కు చెందిన మహమ్మద్ షరీఫ్ 1990లో సౌదీ అరేబియాలోని అల్ హస్సాకు హౌస్ డ్రైవర్గా వచ్చారు. గత 36 సంవత్సరాలుగా ఒకే స్పాన్సర్ వద్ద ఎంతో నిబద్ధతతో సేవలందించారు.
ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై కుప్పకూలడంతో, అల్ హస్సా ఆసుపత్రిలో సుమారు నెల రోజుల పాటు చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయనకు ఒక చేయి, ఒక కాలు పనిచేయని పరిస్థితి ఉన్నప్పటికీ, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉన్నారు.
ఈ క్లిష్ట సమయంలో ఆయన స్పాన్సర్ కుటుంబ సభ్యుల్లా అండగా నిలిచారు. ఆసుపత్రిలో చేరిన నాటి నుండి అన్ని బాధ్యతలను స్వయంగా చూసుకున్నారు. వాస్తవానికి, ఆయనను స్వదేశానికి పంపాలని స్పాన్సర్ కుటుంబానికి ఇష్టం లేకపోయినా, "ఇక్కడే ఉంచి మేమే చూసుకుంటాం" అనే ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేశారు.
అయితే, స్వదేశంలో చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత తిరిగి వస్తానని మహమ్మద్ షరీఫ్ హామీ ఇవ్వడంతో, ఆయన కోరికను గౌరవించి స్వదేశానికి పంపేందుకు స్పాన్సర్ ముందుకొచ్చారు.
ఈ ప్రక్రియలో సహాయం కోసం అల్ హస్సాలోని ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రసాద్ కరుణాగప్పల్లిని సంప్రదించారు. ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి ప్రయాణానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయడంతో పాటు, ఫ్లైట్ కన్ఫర్మేషన్ కోసం మంజుతో సమన్వయం చేస్తూ అన్ని పేపర్వర్క్ను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రయాణానికి సంబంధించిన అన్ని ఖర్చులను స్పాన్సర్ భరించారు. నేడు మహమ్మద్ షరీఫ్ వీల్చైర్లో స్వదేశానికి బయలుదేరారు.
ఈ సేవా కార్యక్రమంలో సహకరించిన స్పాన్సర్కు, ప్రసాద్ కరుణాగప్పల్లికి, మంజుకు, అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ వివిధ ప్రాంతాల సాటా అధ్యక్షులు మల్లేశన్, శ్రీనివాస్ మచ్చ, సర్వని విద్యాధరణి, తేజ పళ్లెం, పామిరెడ్డి రామిరెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు..
ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై కుప్పకూలడంతో, అల్ హస్సా ఆసుపత్రిలో సుమారు నెల రోజుల పాటు చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయనకు ఒక చేయి, ఒక కాలు పనిచేయని పరిస్థితి ఉన్నప్పటికీ, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉన్నారు.
ఈ క్లిష్ట సమయంలో ఆయన స్పాన్సర్ కుటుంబ సభ్యుల్లా అండగా నిలిచారు. ఆసుపత్రిలో చేరిన నాటి నుండి అన్ని బాధ్యతలను స్వయంగా చూసుకున్నారు. వాస్తవానికి, ఆయనను స్వదేశానికి పంపాలని స్పాన్సర్ కుటుంబానికి ఇష్టం లేకపోయినా, "ఇక్కడే ఉంచి మేమే చూసుకుంటాం" అనే ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేశారు.
అయితే, స్వదేశంలో చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత తిరిగి వస్తానని మహమ్మద్ షరీఫ్ హామీ ఇవ్వడంతో, ఆయన కోరికను గౌరవించి స్వదేశానికి పంపేందుకు స్పాన్సర్ ముందుకొచ్చారు.
ఈ ప్రక్రియలో సహాయం కోసం అల్ హస్సాలోని ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రసాద్ కరుణాగప్పల్లిని సంప్రదించారు. ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి ప్రయాణానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయడంతో పాటు, ఫ్లైట్ కన్ఫర్మేషన్ కోసం మంజుతో సమన్వయం చేస్తూ అన్ని పేపర్వర్క్ను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రయాణానికి సంబంధించిన అన్ని ఖర్చులను స్పాన్సర్ భరించారు. నేడు మహమ్మద్ షరీఫ్ వీల్చైర్లో స్వదేశానికి బయలుదేరారు.
ఈ సేవా కార్యక్రమంలో సహకరించిన స్పాన్సర్కు, ప్రసాద్ కరుణాగప్పల్లికి, మంజుకు, అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ వివిధ ప్రాంతాల సాటా అధ్యక్షులు మల్లేశన్, శ్రీనివాస్ మచ్చ, సర్వని విద్యాధరణి, తేజ పళ్లెం, పామిరెడ్డి రామిరెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు..